-

అంబికా కృష్ణకు సమైక్య సెగ

3 Sep, 2013 11:40 IST|Sakshi

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణకు మంగళవారం ఏలూరులో సమైక్య సెగ తగిలింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏలూరు నగరంలో  ఏపీ ఎన్జీవోలు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి సంఘీభావం తెలిపేందుకు ఆయన వచ్చారు. ఆ క్రమంలో ఆయనకు ఎన్జీవోల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది.

 

అంబికా కృష్ణ గోబ్యాక్ అంటూ ఎన్జీవోలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చి ఈ ప్రాంతంలో ఆత్మగౌరవ యాత్ర ఎలా చేస్తారని వారు ఆ సందర్భంగా అంబికా కృష్ణను ఎన్జీవోలు ప్రశ్నించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పార్టీకి, పదవులకు రాజీనామా చేయాలని ఉద్యోగులు అంబికా కృష్ణను డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు