సీఎం జగన్‌కు అమిత్‌ షా ఫోన్‌

18 Jun, 2020 18:30 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేశారు. భారత్‌-చైనాల మధ్య చోటుచేసుకున్న పరిణామాలపై శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌కు అమిత్‌ షా ఫోన్‌ చేశారు. ఈ క్రమంలోనే రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా సీఎం జగన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కాగా, ప్రధాని మోదీ  నిర్వహిస్తున్న రేపటి అఖిలపక్ష సమావేశంలో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొననున్నారు.

మరిన్ని వార్తలు