నీ ఓటు ఎవరో వేసేశారమ్మా...!

13 Feb, 2015 17:54 IST|Sakshi

తిరుపతి(రూరల్): తిరుపతి శాసనసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓ మహిళ... అధికారులు చెప్పిన విషయాన్ని విని అవాక్కయింది. గాయత్రీ నగర్‌కు చెందిన శోభ(30) శుక్రవారం మధ్యాహ్నం స్థానికంగా 255వ నంబర్ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. పోలింగ్ కేంద్రంలోని అధికారులకు గుర్తింపు కార్డు చూపగా... జాబితాను పరిశీలించి మీ ఓటు ఇప్పటికే వేసేశారు అంటూ బదులిచ్చారు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే ఆందోళనకు దిగారు. తన ఓటు ఇంకొకరు ఎలా వేస్తారంటూ పోలింగ్ అధికారులను ఆమె నిలదీశారు. ఆమెకు మద్దతుగా మరికొందరు కూడా ఆందోళనలో పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు