-
పంచాయతీ ఎన్నికల సందర్భంగా నాలుగంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ శుక్రవారం వెల్లడించారు. పంచాయతి వేలంపాటలకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిగి ఎస్ఐపై విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 15 వేల 240 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తన ఈమెయిల్ హ్యక్ చేసి సత్యసాయి సమీప బంధువు రత్నాకర్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని గణపతిరాజు ఫిర్యాదును పరిశీలిస్తున్నామని అన్నారు.