ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

5 Aug, 2014 19:30 IST|Sakshi

హైదరాబాద్: ఈ నెల 18 నుంచి వచ్చే నెల 13 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. మంగళవారం సాయంత్రం సమావేశమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ల భేటీ ముగిసింది.

ఇరు సభల మధ్య ఏలాంటి విభేదాలు ఉండరాదని, ఏవైనా సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు చెప్పారు. రెండు సభలు ఏకకాలంలో జరుగుతాయని, ఎలాంటి సమస్య వచ్చినా కలసి చర్చించుకుంటామని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. ఈ సమావేశంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల స్పీకర్లతో పాటు శాసనమండలి చైర్మన్లు, ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు