-

భూమిపూజకు బంగారు పూత తాపీ, వెండి గమేళా

5 Jun, 2015 08:20 IST|Sakshi

తెనాలి: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూమి పూజకు అతి ముఖ్యమైన సామగ్రి తెనాలి నుంచి సమకూరనుంది. బంగారు, వెండి నాణేలు, నవరత్నాలుగా పిలుచుకునే వైఢూర్యం, పుష్యరాగం, పచ్చ, నీలం, కెంపు, వజ్రం, గోమేధికం, పగడం, ముత్యంను తుళ్లూరు తహశీల్దారు సుధీర్ బాబు తెనాలి నుంచి కొనుగోలు చేశారు. అలాగే భూమిపూజకు అవసరమైన గమేళా, తాపీని అంగలకుదురుకు చెందిన వెంకట్రామయ్య వెండితో తయారు చేయించటం విశేషం. కిలో వెండితో వెండి గమేళా, తాపీ చేయించి, తాపీకి బంగారుపూత పూయించారు.

మరిన్ని వార్తలు