ఎర్రచందనం విక్రయానికి నోటిఫికేషన్ జారీ

8 Aug, 2014 12:53 IST|Sakshi

హైదరాబాద్: ఎర్రచందనం అమ్మకానికి ఈ - టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. వచ్చే నెల 19 నుంచి 26 మధ్య 4,159 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది. ఈ - టెండర్ల విధానం ద్వారా టెండర్లు స్వీకరిస్తామని తెలిపింది. ఎర్రచందనాన్ని గ్రేడులుగా విభజించనున్నట్లు తెలిపింది. ఏ గ్రేడ్కు రూ.12 లక్షలు, బి గ్రేడ్కు రూ.10 లక్షలు, సి గ్రేడ్కు రూ. 8 లక్షల కనీన ధరగా నిర్ణయించినట్లు అటవీశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు