టంగుటూరికి చంద్రబాబు ఘన నివాళులు

23 Aug, 2014 09:29 IST|Sakshi

హైదరాబాద్ : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 140వ  జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. నేడు ఆయన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం అసెంబ్లీ ఎదురుగా ఉన్న టంగుటూరి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

కాగా  టంగుటూరి ప్రకాశం పంతులు జన్మదినాన్ని ప్రభుత్వం ఈ ఏడాది నుంచి రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నెల 23న ప్రకాశం పంతులు జయంతిని పండుగగా నిర్వహించాలని, అందుకోసం ఆయా శాఖల బడ్జెట్ నుంచి నిధులు కేటాయించాలని సర్కారు ఆదేశించింది.

 

మరిన్ని వార్తలు