-
ఆంధ్రప్రదేశ్ హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 12 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అత్యధికంగా నెల్లూరులో 32 మంది కరోనా బాధితులు ఉన్నారు. ఇక జిల్లాల వారిగా కృష్ణా 23, గుంటూరు 20, వైఎస్సార్ కడప 19, ప్రకాశం 17, పశ్చిమ గోదావరి 15, విశాఖపట్నం 14, చిత్తూరు, తూర్పు గోదావరిలో 9 పాజిటివ్ కేసుల చొప్పున నమోదు అయ్యాయి. అయితే తాజాగా నమోదయిన పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీ ప్రార్థనలు వెళ్లి వచ్చిన వారేకావడం గమనార్హం.