శబరిమలలో ఏపీ పోలీసులకు తీవ్రగాయాలు

1 Dec, 2017 15:17 IST|Sakshi

శబరిమల : శబరిమల సన్నిధానం సమీపంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 14మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఎనిమిదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా వీరంతా శబరిమలలో విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని కేరళ ఆర్టీసీ బస్సు వేగంగా ముందు నుంచి ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పోలీసుల వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు