సాక్షి, విజయవాడ : ఆంధ్రపదేశ్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ నేతలు ఎండీ సురేంద్రబాబుకు సమ్మె నోటీసులు అందించారు. గురువారం ఈయూ కార్యాలయంలో సమావేశమై న ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెపై చర్చించారు. ఇప్పటికే 46 డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ మరో 30 డిమాండ్లను కొత్తగా చేర్చి ఎండీ సురేంద్రబాబుకు అందజేశారు. అనంతరం జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపో, యూనిట్లలో సమ్మె సన్నాహక ధర్నాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 17, 18 తేదిలలో అన్ని స్థాయిల ఉద్యోగులు డిమాండ్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామన్నారు. 22న 13 జిల్లాలలో ఉన్న ఆర్ఎమ్ కార్యాలయాలవద్ద జేఏసీ ఆధ్యర్యంలో మహాధర్నా చేపట్టి అదే రోజు సమ్మెతేదిని ప్రకటిస్తామన్నారు. ఈ నెల 22 తర్వాత ఏ క్షణం నుంచైనా సమ్మే జరిగే అవకాశం ఉందని, తమతో ఎన్ఎమ్యూ కలిసి రావాలని జేఏసీ నేతలు కోరారు.
ఆర్టీసీ జేఏసీ ప్రధాన డిమాండ్లు