కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్టు

18 Jun, 2020 19:03 IST|Sakshi

సాక్షి, విజయవాడ : భారీ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో రికార్టు సృష్టించింది. తాజాగా రాష్ట్రంలో కరోనా వైద్య పరీక్షలు 6 లక్షల మార్క్‌ను దాటాయి. ఇప్పటివరకు 6,12, 397 మందికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో దేశంలోనే వైద్య పరీక్షల్లో ఏపీ నెంబర్‌ 1గా నిలిచింది. తొలుత లక్ష మందికి కరోనా పరీక్షలు నిర్వహించడానికి 58 రోజుల సమయం పట్టగా.. ఇప్పుడు 7 రోజుల్లోనే లక్ష పరీక్షలు చేసే సామర్థ్యానికి ఏపీ చేరుకుంది.

మరిన్ని వార్తలు