నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

21 Feb, 2015 09:28 IST|Sakshi

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రాయితీల విషయంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు పోరాడితే..మద్దతివ్వాలా లేదా అని తర్జనభర్జనలో ఉంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులు హాజరు కానున్నారు.

 

మరిన్ని వార్తలు