రానున్న ఐదేళ్లలో ఏపీకి రూ. 22,113 కోట్లు

24 Feb, 2015 15:41 IST|Sakshi
రానున్న ఐదేళ్లలో ఏపీకి రూ. 22,113 కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక లోటును భర్తీ చేసుకోడానికి రానున్న ఐదేళ్లలో మొత్తం రూ. 22,113 కోట్లను కేటాయించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మొత్తం 11 రాష్ట్రాలు రెవెన్యూ లోటులో ఉన్నాయని ఆయన చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించామని, దాని నివేదికను పార్లమెంటులోప్రవేశపెట్టామని వివరించారు.

రెవెన్యూ లోటు ఉన్న గ్రామాలకు అదనపు నిధులు కేటాయిస్తామని కూడా చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఏప్రిల్ 1 నుంచి అమలవుతాయని వివరించారు. మొత్తం రూ. 1.91 లక్షల కోట్ల రెవెన్యూ లోటు ఉందని అన్నారు.

మరిన్ని వార్తలు