ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పేరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన తరువాత వస్తున్న తొలి స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కర్నూలులో నిర్వహించే ఈ వేడుకలను సన్రైజ్ ఏపీ పేరుతో నిర్వహించనున్నారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించే 12 శకటాలను ప్రదర్శించనున్నారు.