ఏపీలో 304కి చేరుకున్న కరోనా కేసులు

7 Apr, 2020 11:27 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయ్యింది. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు కేవలం ఒక్క కరోనా కేసు మాత్రమే పాజిటివ్‌గా తేలిసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 304​కి చేరింది. ఇక జిల్లాల వారిగా అత్యధికంగా కర్నూలులో 74 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నెల్లూరులో 42, గుంటూరు 33, కృష్ణా 29, వైఎస్సార్‌ జిల్లాలో 27,  విశాఖపట్నం 20, పశ్చిమ గోదావరి 21, చిత్తూరు 17, తూర్పు గోదావరి 11,  ప్రకాశం 24,  అనంతపురంలో 6 కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటిన్‌ను విడుదల చేసింది.

మరిన్ని వార్తలు