ఎవరెస్టు అధిరోహించనున్న విశాఖ బాలిక

15 Jul, 2014 03:23 IST|Sakshi
ఎవరెస్టు అధిరోహించనున్న విశాఖ బాలిక

విశాఖపట్నం: పిన్న వయసులోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేయటానికి సంకల్పించింది విశాఖపట్నానికి చెందిన 12 ఏళ్ల జాహ్నవి. ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని (8,848 మీటర్లు) అధిరోహించడంతో పాటు మిగతా ఆరు శిఖరాలనూ ఎక్కేందుకు సాధన చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 2న హిమాచల్‌ప్రదేశ్ లడఖ్ ప్రాంతంలోని లే మౌంటైన్ (20,080 అడుగులు) ఎక్కడంతో పాటు ప్రపంచంలో ఏడు శిఖరాలపైనా పాదం మోపేందుకు అక్కడ 15 రోజులు శిక్షణ పొందనుంది. అనంతరం ప్రపంచంలో ఎత్తయిన శిఖరాల్లో ఒకటైన కిలిమంజారో (5,895 మీటర్లు) సెప్టెంబర్‌లో తొలిసారిగా అధిరోహించనుంది. తరువాత ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించనుంది. ఈ వివరాలను ఆమె తండ్రి డాక్టర్ కృష్ణారావు సోమవారం విశాఖపట్నంలో విలేకరులకు చెప్పారు.

మరిన్ని వార్తలు