అవంతి ఫీడ్స్‌తో ఏయూ ఎంఓయూ

5 Nov, 2019 18:38 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: అవంతి ఫీడ్స్‌తో ఆంధ్రాయూనివర్శిటీ ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ మేరకు పరస్పర అవగాహన ఒప్పందంపై మంగళవారం ఏయూ వీసీ ప్రొఫెసర్‌ ప్రసాద్‌రెడ్డి, అవంతి ఫీడ్స్‌ జేఎండీ సీఆర్‌రావు సంతకాలు చేశారు. సుమారు నాలుగు కోట్లతో ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా అవంతి ఫీడ్స్‌..కార్పొరేట్‌ సోషల్‌ బాధ్యత కింద ఆంధ్రా యూనివర్శిటీలో మౌలిక వసతుల కల్పన, మెరైన్‌ లివింగ్‌ సోర్స్‌ విభాగం, విస్తరణ, మత్స్యకారులకు శిక్షణ అందించనుంది.

మరిన్ని వార్తలు