తెలుగు రాష్ట్రాలలో ఏయూ నంబర్‌ 1

9 Sep, 2017 01:55 IST|Sakshi
టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సర్వేలో మొదటి స్థానం
 
ఏయూ క్యాంపస్‌ (విశాఖ తూర్పు): టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సర్వేలో ఆంధ్ర విశ్వ విద్యాలయం మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏయూ నంబర్‌ వన్‌గా నిలిచింది. టైమ్స్‌ విడుదల చేసిన ర్యాంకుల్లో గత ఏడాది లాగానే ఏయూ 800–1000 ర్యాంకుల మధ్యే నిలిచింది. అయితే గతంతో పోల్చితే కొంత మెరుగైన స్థానాన్ని సంపాదించింది.

దక్షిణాది రాష్ట్రాల్లో మూడో స్థానం, దేశంలోనే 19వ స్థానంలో నిలిచింది. పరిశోధనలు, బోధన, విద్యార్థి ఆచార్యుల నిష్పత్తి, ప్రాంగణ ఎంపికలు, మౌలిక వసతులు, పరిశ్రమల నుంచి ఆదాయం, అంతర్జాతీయ దృక్పథం వంటి రంగాలను ప్రాతిపదికగా తీసుకుని టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఈ ర్యాంకును అందించింది.
మరిన్ని వార్తలు