'ఇరాక్ నుంచి తెలుగువారిని క్షేమంగా రప్పిస్తాం'

17 Jun, 2014 13:09 IST|Sakshi
'ఇరాక్ నుంచి తెలుగువారిని క్షేమంగా రప్పిస్తాం'

ఇరాక్లో అంతర్యుద్ధం నేపథ్యంలో అక్కడి తెలుగువారిని కాపాడేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సమాచార,ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి వెల్లడించారు. ఇరాక్ నుంచి వెనక్కి రావాలనుకుంటున్న తెలుగువారందరిని క్షేమంగా రప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ అంశంపై కేంద్రప్రభుత్వంతో చర్చించేందుకు రేపు తాను న్యూఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పారు. అలాగే భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్కు కూడా లేఖ రాస్తామని పల్లె రఘునాథ్ రెడ్డి వివరించారు.

మరిన్ని వార్తలు