విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ ఒడిశా నుంచి కోస్తాంధ్ర తీరాల మధ్య కేంద్రీకృతమైంది. ఈ కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సాధారణ వర్షాలు, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.