త్వరలో ‘సచివాలయ’ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్‌

23 Dec, 2019 04:19 IST|Sakshi

జిల్లాల వారీగా భర్తీ కాని ఉద్యోగాల వివరాల సేకరణ

నేటిలోగా పంపాలంటూ కలెక్టర్లకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఆదేశాలు

సాక్షి, అమరావతి: మిగిలిపోయిన సచివాలయ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు వీలుగా జిల్లాల్లో పోస్టుల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను సేకరిస్తున్నారు. ఏ జిల్లాలో ఏ పోస్టులో ఎన్ని ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోయాయో సోమవారం సాయంత్రం నాటికి తెలపాలంటూ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారమిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల వారీగా ఖాళీ పోస్టుల వివరాలను పంపాలని సూచించారు. అనంతరం ఆ వివరాలను సంబంధిత శాఖలకు పంపి నోటిఫికేషన్‌ జారీకి చర్యలు చేపట్టనున్నట్టు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు వివరించారు.

మరిన్ని వార్తలు