మరో మూడు కోవిడ్‌ ల్యాబొరేటరీలు

3 Apr, 2020 05:03 IST|Sakshi

రేపటి నుంచి కడప, గుంటూరు ల్యాబ్‌లు అందుబాటులోకి

ఆదివారం సాయంత్రానికి విశాఖ ల్యాబ్‌ కూడా..

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 వైరస్‌ నిర్ధారణ పరీక్షల నిమిత్తం మరో మూడు ల్యాబొరేటరీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఈవో, ల్యాబొరేటరీల నిర్వాహణాధికారి డాక్టర్‌ ఎ.మల్లికార్జున గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఏమన్నారంటే..

►  కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షల కోసం రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు ల్యాబొరేటరీలు పనిచేస్తున్నాయి.
►  శనివారం నుంచి కడప, గుంటూరులలో ఏర్పాటు చేసిన ల్యాబొరేటరీలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం.
►  ఆదివారం సాయంత్రానికి విశాఖపట్నం ల్యాబొరేటరీని కూడా సేవల పరిధిలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం.
►  ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 450 కోవిడ్‌–19 టెస్టులు జరుగుతుండగా, ఈ కొత్త ల్యాబులు అందుబాటులోకి వస్తే ఆ సంఖ్య 570 టెస్టులకు పెరుగుతుంది.
►  స్థానికంగా టెస్టులు చేయడం వల్ల నమూనాలను తరలించేందుకు అయ్యే రవాణా వ్యయం తగ్గుతుంది.
►  రవాణా సమయం కూడా తగ్గడం వల్ల తొందరగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. 

>
మరిన్ని వార్తలు