ఏపీ భవన్‌లో ఉద్యోగుల ఆందోళన

10 May, 2018 15:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగాల భర్తీ విషయంలో అధికారులు అన్యాయం చేస్తున్నారని ఢిల్లీలోని ఏపీ భవన్‌ ఉద్యోగలు గురువారం ఆందోళన బాట పట్టారు. రిటైర్‌ అయిన వారకే మళ్లీ ఉద్యోగాలు ఇస్తూ నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని ఏపీ భవన్‌ ఉద్యోగుల సంక్షేమసంఘం ఆందోళ వ్యక్తం చేసింది. ఏపీ భవన్‌లో ఉన్న ఉద్యోగాలు అన్నీ తెలుగువారితోనే భర్తీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు సైతం తెలుగువారికే ఇవ్వాలంటూ నిరసనకు దిగారు. జాయింట్‌ కమీషనర్‌, అసిస్టెంట్‌ కమీషనర్‌ పోస్టుల కోసం సరెండర్‌ చేసిన 12 పోస్టులను తిరగి ఇవ్వాలని ఏపీ భవన్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది.

మరిన్ని వార్తలు