నేడు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీల అమలులో శరవేగంగా దూసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలోని మరిన్ని అంశాల అమలుకు రంగం సిద్ధంచేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రివర్గం భేటీ అవుతోంది. సచివాలయంలో ఉదయం 11గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. చర్చించే అంశాలివీ...
►రాష్ట్ర ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా రూ.46,675 కోట్ల వ్యయంతో భారీ వాటర్ గ్రిడ్.
►మగ్గం ఉన్న చేనేత కార్మికుల కుటుంబాలకు ఏడాదికి రూ.24వేల చొప్పున డిసెంబర్ 21న ఆరి్థక సాయం అందించేందుకు విధివిధానాలు.
►ఇసుక రవాణాకు సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా 6000 వాహనాలను ఆయా వర్గాల యువతకు సమకూర్చడం.
►ఔట్ సోర్సింగ్లో దళారీ వ్యవస్థను నిర్మూలించి రాష్ట్రస్థాయిలో డిసెంబర్ 1 నుంచి కార్పొరేషన్ ఏర్పాటు.
►జనవరి 26 నుంచి జగనన్న అమ్మ ఒడి పథకం అమలు.
►చిరు ధాన్యాలను పండించే రైతులను ప్రోత్సహించేందుకు, ఆ పంటలకు గిట్టుబాటు ధర కలి్పంచేందుకు వీలుగా ప్రత్యేకంగా బోర్డు. దీనితోపాటు పప్పు, వరి ధాన్యాల బోర్డులు.
►గ్రామ న్యాయాలయాలు, ఉన్నత విద్య, స్కూలు విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల సభ్యుల నియామకాలు..
►రోబో ఇసుక తయారీ.
►ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం రూ.50కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకం.