ప్రారంభమైన ఏపీ కేబినేట్‌ సమావేశం

4 Sep, 2019 11:08 IST|Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినేట్‌ బుధవారం సమావేశమైంది. ఈ సమావేశంలో కేబినేట్‌ పలు కీలకమైన నిర్ణయాలను తీసుకోనుంది. ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు మంత్రి మండలి ఆమోదముద్ర వేయనుంది. రేపటినుంచి అమల్లోకి రానున్న కొత్త ఇసుక పాలసీ విధానంపై కేబినెట్ చర్చించనుంది. ఇసుక సరఫరా ధరపై నిర్ణయం, టీటీడీ పాలకమండలి సభ్యులను 19 నుంచి 25కు పెంపుపై చర్చ జరిగే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నాణ్యమైన రేషన్ బియ్యం సరఫరాపై చర్చ జరగనుంది.

మరిన్ని వార్తలు