గుంటూరు-విజయవాడ మధ్యే రాజధాని: కమిటీ స్పష్టత

11 Oct, 2014 20:27 IST|Sakshi
పల్లె రఘునాథ రెడ్డి

హైదరాబాద్: ఏపి రాజధాని గుంటూరు-విజయవాడ మధ్యేనని భూసేకరణ కమిటీ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భూసేకరణ కమిటీ(మంత్రి మండలి ఉపసంఘం) సమావేశం ముగిసింది.  అనంతరం కమిటీ సభ్యుడు మంత్రి పల్లె రఘునాథ రెడ్డి సమావేశం వివరాలను విలేకరులకు తెలిపారు.  భూసేకరణపై రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ నెల 17, 18, 19 తేదీలలో విజయవాడ, గుంటూరులలో పర్యటిస్తామని చెప్పారు.

 తొలిదశలో రాజధాని కోసం 30 వేల ఎకరాలు సేకరిస్తామని చెప్పారు. రైతులకు మేలు చేసే విధంగా భూ సేకరణ జరుగుతుందన్నారు. 60:40 శాతం నిష్పత్తిలో భూసేకరణ జరుగుతుందని చెప్పారు.

తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు మంత్రి నారాయణను విశాఖపట్నం పంపిస్తున్నట్లు మంత్రి పల్లె తెలిపారు.
**

>
మరిన్ని వార్తలు