సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రీ పోలింగ్ జరిగే జిల్లాల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం జరగనున్న రీ పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లుపై చర్చించారు. ఈ కాన్ఫ్రెన్స్లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో రెండు, ప్రకాశంలో ఒకటి, నెల్లూరు జిల్లాలో రెండుచోట్ల ఈ నెల 6న రీ పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్లో రీ పోలింగ్ జరిగే బూత్ల వివరాలు: