సీఎం వైఎస్‌ జగన్‌ 15న అమెరికా పర్యటన

12 Aug, 2019 08:27 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు వెళుతున్నారు. 24న తాడేపల్లికి తిరిగి వస్తారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత అదే రోజు ఆయన హైదరాబాద్‌ వెళ్తారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో రాత్రికి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరతారు. సీఎం చిన్న కుమార్తె వర్షా రెడ్డిని అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్‌ కోర్సులో చేర్పించేందుకు వెళుతున్నారని సమాచారం. 17న డల్లాస్‌లోని కే బెయిలీ హచిసెన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజలతో జరిగే ఆత్మీయ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొంటారని వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి.  

చదవండి: బహుదూరపు బాటసారి అమెరికాయానం...

మరిన్ని వార్తలు