అందరికీ హోలీ శుభాకాంక్షలు: సీఎం వైఎస్‌ జగన్‌

9 Mar, 2020 11:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: హోలి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ అందరి జీవితాల్లో శాంతిసౌఖ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రతీ ఒక్కరు ఆనందకరమైన, సురక్షితమైన, రంగుల హోలీ జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.(ఓటమి విజయానికి తొలిమెట్టు : సీఎం జగన్‌)

హోలీ పండుగ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్‌
హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రంగుల వసంతోత్సవాన్ని ప్రజలంతా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. 

మరిన్ని వార్తలు