సీఎం జగన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు

31 Dec, 2019 12:24 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019 మన రాష్ట్ర చరిత్రనే మేలిమలుపు తిప్పిన సంవత్సరంగా గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఆనందం నింపే సంవత్సరంగా 2020 గుర్తుండిపోవాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ట్విటర్‌లోనూ ఆయన ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019 ఒక ప్రత్యేక సంవత్సరమని, ఈ సంవత్సరమంతా తనపై చూపిన విశేషమైన ప్రేమాభిమానాలు, ఆదరణకు ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న నూతన సంవత్సరం 2020లో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు