సీఎం జగన్‌ను కలిసిన డీజీపీ సవాంగ్‌

1 Jun, 2019 15:29 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని డీజీపీ గౌతం సవాంగ్‌ మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు. నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారి ముఖ్యమంత్రిని తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ నూతన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసుగా గౌతమ్‌ సవాంగ్‌ శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన తొలుత గాడ్‌ ఆఫ్‌ ఆనర్‌ స్వీకరించారు.  సవాంగ్‌ డీజీపీతో పాటు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా కొనసాగుతారు. ఇప్పటిదాకా డీజీపీగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్, స్టేషనరీ అండ్‌ స్టోర్స్, పర్ఛేజ్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు.

చదవండి: (బాధ్యతలు స్వీకరించిన ఏపీ డీజీపీ)

మరిన్ని వార్తలు