మహిళలకు రక్షా బంధన్‌ శుభాకాంక్షలు: ఏపీ డీజీపీ

15 Aug, 2019 13:54 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ రక్షా బంధన్‌ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం డీజీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు జరిగాయి. డీజీపీకి మహిళా మిత్ర సభ్యులు, గురుకుల పాఠశాల విద్యార్థినులు, వృద్ధులు రాఖీలు కట్టి.. రాఖిపూర్ణిమ, స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా రక్షణకి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళా మిత్ర ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు