చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

5 Jan, 2020 12:43 IST|Sakshi

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ

సాక్షి, విజయవాడ: దళిత ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ ఖండించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐఏఎస్‌ అధికారులను కించపరిచేలా మాట్లాడటం చంద్రబాబు, టీడీపీ నేతలకు కొత్తేమీ కాదన్నారు. గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం, గోపాలకృష్ణ ద్వివేదిపై చంద్రబాబు దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. విజయకుమార్‌పై చేసిన వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు. ‘గతంలో ఐపీఎస్‌ అధికారిని పట్టుకుని అచ్చెన్నాయుడు యూస్‌లెస్ ఫెలో అంటూ బూతులు తిట్టారు. ఐపీఎస్‌ అధికారి బాల సుబ్రహ్మణ్యంపై కేశినేని నాని, బోండా ఉమా నడిరోడ్డుపైనే దాడికి దిగారని’ మండిపడ్డారు. ఐఏఎస్‌ అధికారులను కించపరిచేలా మాట్లాడటం తగదని సూర్యనారాయణ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు