‘హుద్‌హుద్’ బాధిత రైతులకు రూ.140.36 కోట్లు విడుదల

7 Dec, 2014 00:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను వల్ల పంటలు కోల్పోయిన రైతులకు పెట్టుబడి రాయితీ కోసం ప్రభుత్వం రూ. 140.36 కోట్లు విడుదల చేసింది. ఈమేరకు విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ ఏఆర్ సుకుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెట్టుబడి రాయితీని 50 శాతం పైగా పంట నష్టపోయిన సన్న, చిన్నకారు రైతుల అకౌంట్లలో ఆన్‌లైన్ ద్వారా జమ చేయాలని ఆదేశించింది.  
 

మరిన్ని వార్తలు