సాక్షి, అమరావతి: సంబంధిత శాఖా మంత్రులు ప్రతీ బుధవారం సచివాలయంలో అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల కోసం ఈ మేరకు అందుబాటులో ఉండాలని పేర్కొంది. సందర్శకుల ముందస్తు ఏర్పాట్లు, సౌకర్యార్థం ఉత్వర్వులు జారీ చేసినట్లు తెలిపింది.