సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు హైదరాబాద్లో కొనసాగిన ఏపీఈఆర్సీ కార్యాలయం ఇకపై ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా పనిచేస్తుందని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.