విశాఖలో గవర్నర్‌ హరిచందన్‌కు ఘన స్వాగతం

31 Jul, 2019 10:32 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గవర్నర్‌ హోదాలో ఆయన తొలిసారి విశాఖలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చిన గవర్నర్‌కు జిల్లా కలెక‍్టర్‌ వినయ్‌ చంద్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ మీనా, నేవీ అధికారులు స‍్వాగతం పలికారు. గవర్నర్‌ మొదట తూర్పు నావికాదళం ఆపరేషన్‌ బేస్‌ను సందర్శించి, సర్క్యూట్‌ హౌస్‌కు వెళతారు. సాయంత్రం కైలాసగిరికి వెళ్లి తెలుగు మ్యూజియం, అనంతరం డాక్టర్‌ వైఎస్సార్‌ సిటీ సెంట్రల్‌ పార్క్‌ను సందర్శిస్తారు. గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించి బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపును ప్రారంభిస్తారు. అదే రోజు మధ్యాహ్నం పోర్ట్‌ ట్రస్ట్‌ని సందర్శించి అక్కడ నుంచి రాత్రికి విజయవాడ బయలుదేరనున్నారు.


 

మరిన్ని వార్తలు