ప్రధాన మంత్రితో గవర్నర్‌ హరిచందన్‌ భేటీ 

10 Aug, 2019 04:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం తొలిసారిగా ఢిల్లీ వచ్చిన గవర్నర్‌ శుక్రవారం ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రధాన మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

అలాగే ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను, కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను గవర్నర్‌ కలిశారు.  కాగా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఏపీ భవన్‌లో గవర్నర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.  

మరిన్ని వార్తలు