‘అక్షయ గోల్డ్’ ఆస్తుల స్వాధీనానికి ఉత్తర్వులు

6 Dec, 2014 02:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల స్కీముల పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడి, రూ.కోట్లలో దండుకున్న అక్షయ గోల్డ్ ఫార్మ్స్ అండ్ విల్లాస్ ఇండియా సంస్థ ఆస్తుల స్వాధీనానికి అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 26 మందికి చెందిన, సంస్థ/వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.10.15 కోట్ల నగదుతో పాటు 2,354 ఎకరాల స్థలాలను సైతం స్వాధీనం చేసుకోనున్నారు.
 

మరిన్ని వార్తలు