సాక్షి, గుంటూరు : మద్య నిషేధంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ మద్య నిషేధమే లక్ష్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో ఎంతోమంది మహిళలు మద్యంపై వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారని, సీఎం అయ్యాక ఆయన ఆ దిశగా చర్యలు చేపట్టారని వెల్లడించారు. విమోచన కమిటీలో లక్ష్మణరెడ్డికి బాధ్యతలు అప్పగించారని హోంమంత్రి తెలిపారు.