ఏకగ్రీవం అయితే భారీ నజరానా

13 Mar, 2020 08:57 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన పంచాయతీలకు భారీ నజరానాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నజరానాను జనాభా ప్రాతిపదికన నాలుగు విభాగాలుగా విభజించారు. రెండు వేల జనాభా ఉన్న గ్రామాలకు రూ.5 లక్షలు, 2 నుంచి 5 వేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ.10 లక్షలు, 5 నుంచి 10 వేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ.15 లక్షలు, 10,000 జనాభా దాటిన గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవమైతే రూ.20 లక్షల నజరానా ఇవ్వనున్నట్లు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

మహిళలు.. మహారాణులు
రాష్ట్రంలో 13,368 గ్రామ పంచాయతీలు ఉండగా, సగానికిపైగా మహిళలకే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు చేసింది. 6,831 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లుగా మహిళలే రాబోతున్నారు. ఈ మేరకు రిజర్వేషన్ల వివరాలను పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేసింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ వారీగా రిజర్వేషన్ల వివరాలు..

మొత్తం గ్రామ పంచాయతీలు:      13,368
ఎస్టీ మహిళ:       762 
ఎస్టీ జనరల్‌:     480
బీసీ మహిళ:    1,615  
బీసీ జనరల్‌:  1,543
జనరల్‌ మహిళ:     3,096 
జనరల్‌:  3,375 

మరిన్ని వార్తలు