జాబు కావాలంటే జగన్ రావాలి. జగనే నెక్ట్స్ సీఎం కావాలి అంటూ సాయిగణపతి పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయిగణపతి ఇంజినీరింగ్, పాలి టెక్నిక్ కళాశాలల ముందు నుంచి పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా కళాశాల గేటు వద్ద వందలాది మంది విద్యార్థులు వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. జగనన్న సీఎం కావాలి మా అందరికి ఉద్యోగాలు రావాలి అని వారంతా పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కోర్సుకు ఫీజు రీయింబర్స్మెంట్ అరకొరగానే వస్తోందని, కోర్సు పూర్తి చేసిన వారికి మూడేళ్ల తర్వాతే ధ్రువీకరణపత్రాలు ఇస్తున్నారని పలువురు విద్యార్థులు జననేత దృష్టికి తీసుకెళ్లారు.