'సీమాంధ్ర ఎంపీలు సభను స్తంభింపచేయాలి'

12 Feb, 2014 16:33 IST|Sakshi
'సీమాంధ్ర ఎంపీలు సభను స్తంభింపచేయాలి'

హైదరాబాద్ : తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవోలు గురువారం సీమాంధ్ర బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ సీమాంధ్ర ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. పార్టమెంట్లో తెలంగాణ బిల్లు పెడితే సీమాంధ్ర ఎంపీలు పార్టీలకతీతంగా సభను స్తంభింప చేయాలన్నారు. సీమాంధ్ర బంద్ను విజయవంతం చేయాలని అశోక్ బాబు కోరారు.
 

మరిన్ని వార్తలు