ఏపీ అధికారుల అత్యుత్సాహం..!!

23 Jan, 2019 11:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దుకాణాలు కూల్చి అన్నా క్యాంటీన్‌ నిర్మాణానికి ప్రయత్నాలు

సాక్షి, వైఎస్సార్‌ కడప : అధికార పార్టీ అండతో ఏపీ ప్రభుత్వాధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రొద్దుటూరు బస్టాండ్‌లోని దుకాణాలను కూల్చి అన్నా క్యాంటీన్‌ నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా, ప్రొద్దుటూరు బస్టాండ్‌లో అన్నా క్యాంటీన్‌ నిర్మాణం చేపట్టొద్దంటూ మున్సిపల్‌ కౌన్సిల్‌ గతంలోనే తీర్మానం చేసింది. దుకాణాలు కూల్చి క్యాంటీన్‌ నిర్మించడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి ఆందోళన కూడా చేపట్టారు. దీంతో క్యాంటీన్‌ నిర్మాణంపై వెనక్కి తగ్గిన అధికారులు టీడీపీ నేతల ఒత్తిడితో మరోమారు క్యాంటీన్‌ నిర్మించేందుకు సమాయత్తం కావడం చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు