ఏపీ పాలీసెట్‌ ఫలితాలు వెల్లడి

10 May, 2018 11:11 IST|Sakshi
పాలీసెట్‌ ఫలితాలు వెల్లడిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలీసెట్‌-2018 ఫలితాలను గురువారం విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫలితాల్లో బాలికలదే పైచేయి అని తెలిపారు. ఏప్రిల్‌ 12న పాలిసెట్‌ నిర్వహించగా మొత్తం 1,29,412 మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారు. మొత్తంగా 80.19 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి వెల్లడించారు.

బాలికలు 84.61శాతం, బాలురు 78.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. తూర్పు గోదావరికి చెందిన గీత సౌమ్య, కంకటాల సాయి శ్రీహర్ష, పశ్చిమ గోదావరికి చెందిన పిల్లి శ్రీకర్‌ బాబు మొదటి స్థానాల్లో నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా హర్ష రెండో స్థానం, పశ్చిమ గోదావరి జిల్లాకు దినకర్‌బాబు మూడో ర్యాంకు దక్కించుకున్నారు. ఫలితాల కోసం చూడండి http://sakshieducation.com

మరిన్ని వార్తలు