ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి

20 Jul, 2018 07:27 IST|Sakshi
మానవహారంగా ఏర్పడిన  నాయకులు

కోవెలకుంట్ల (కర్నూలు): ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నిరుద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దేవరాజు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ గురువారం నిరుద్యోగ జేఏసీ, వీహచ్‌పీఎస్, మాలమహానాడు, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వైభవ్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ర్యాలీ, ధర్నా చేపట్టారు. స్థానిక గాంధీసెంటర్‌ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ, టీడీపీలు హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధన కోసం దశలవారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.  నాయకులు కోగిల ప్రసాద్, సునీల్, సుధాకర్, చినబాబు, సురేష్, బద్రి, అశోక్, శేఖర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు