శ్రీవారి సేవలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు

6 Mar, 2016 10:49 IST|Sakshi

తిరుపతి: తిరుమల శ్రీవారిని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ కుటుంబ సమేతంగా ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని దేవున్ని ప్రార్థించినట్లు చెప్పారు. సకాలంలో వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. టీటీడీ చైర్మన్ చదలవాడ దగ్గరుండి వారికి దర్శన ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు