కాకినాడ:  పక్కకు ఒరిగిన ఐదంతస్తుల భవనం 

19 Sep, 2019 20:22 IST|Sakshi

సాక్షి, కాకినాడ: కాకినాడలోని దేవి మల్టీప్లెక్స్ సమీపంలో ఐదంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. అపార్ట్‌మెంట్ వెనక భాగంలో మూడు పిల్లర్లు శిథిలమైపోయి ఏ క్షణమైనా కూలిపోయే స్థితికి చేరింది. దీంతో అధికారులు భవనాన్ని ఖాళీ చేయించారు. ఇప్పటికే 40 ప్లాట్లను అధికారులు ఖాళీ చేయించారు. ఈ భవనాన్ని 14 ఏళ్ళ క్రితం నిర్మించారు. 

మరిన్ని వార్తలు