హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎంపీలిద్దరూ పార్టీ ఫిరాయించడం ముమ్మాటికి అనైతికమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కొందరు నేతలు ఆక్సిజన్ లేకుండా ఉంటారేమో కానీ అధికారం లేకుండా ఉండలేకపోతున్నారని రఘువీరా ఎద్దేవా చేశారు.
ఫిరాయింపుల నిరోదక చట్టం ప్రకారం ఎన్నికల సంఘం వీరిపై చర్యలు తీసుకోవాలని రఘువీరా డిమాండ్ చేశారు. నేతల ఫిరాయింపు వ్యవహరం వ్యభిచారం కన్నా హీనంగా ఉందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా తీవ్రంగా మండిపడ్డారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కర్పూలు ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.